TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగి అనంతరం ఆరు వర్గాల కొట్లాటకు దారితీసింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి పలువురికి గాయాలయ్యాయి. తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను టీడీపీ శ్రేణులు బద్దలు కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ పోలీసు బలగాలు అక్కడి వారిని చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తమకు ప్రజల్లో వస్తున్నఆదరణ తట్టుకోలేక టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయని మంత్రి వనిత ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ టీడీపీ కార్యకర్త ఇంటిలోకి పలువురు చొరబడి దాడి చేశారు.