Delhi Vs Rajasthan : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి 20 పరుగుల తేడాలో ఆర్ ఆర్ పై గెలిచారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరుకున్నారు. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉన్న ఢిల్లీ 12 పాయింట్లతో ఉంది. రెండు మ్యాచులు గనక గెలిస్తే ఈజీగా ప్లే ఆప్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 12 పాయింట్లతో నాలుగు జట్లు ఉండటంతో ప్లే ఆప్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.
టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు జేమ్స్ ప్రెజర్ ముగుర్క్, అభిషేక్ పొరేల్ దాటిగా ఆడారు. ప్రేజర్ 19 బంతుల్లోనే హాప్ సెంచరీ చేశాడు. 7 ఫోర్లు మూడు సిక్సులతో చెలరేగి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చితకబాదాడు. 4.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 60 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అభిషేక్ పొరెల్ 36 బంతుల్లో 7ఫోర్లు 3 సిక్సుల సాయంతో 65 పరుగులు చేయగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లోనే 42 పరుగులు చేయడంతో ఢిల్లీ 221 పరుగులతో ఇన్సింగ్స్ ను ముగించింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ లోనే యశస్వి జైశ్వాల్ వికెట్ కోల్పోయింది. సంజుశాంసన్ ఒక్కడే 46 బంతుల్లో 6 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజు ఉన్నంత వరకు రాజస్థాన్ రాయల్స్ వైపు ఉన్న మ్యాచ్ కాస్త అతడు ఔటయ్యాక ఢిల్లీ వైపు టర్న్ అయింది. సంజు ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో సంజు ఎంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.
సంజు శాంసన్ ఔటైన తర్వాత మిగితా బ్యాటర్లు వెంట వెంటనే ఔట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ ఇన్సింగ్స్ ముగించాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 25 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీయడంతో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ లభించింది. రాజస్థాన్ రాయల్స్ కు ఈ సీజన్ లో ఇది మూడో ఓటమి. అయినా 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉండగా ఒక్క మ్యాచ్ గెలిచినా సరే ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముంది.