PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి లక్ష్యం కేవలం జగన్ ను ఇంటిదారి పట్టించడమే. కూటమి తో పాటు కాంగ్రెస్ పార్టీ ని అసెంబ్లీ లో అడుగుపెట్టకుండా ఉండటానికి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కానీ గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ను రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, చంద్రబాబు నాయుడి అనుభవం సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నే బాబు, పవన్ కళ్యాణ్ లి రంగం లోకి దింపారు. కానీ జగన్ ను టార్గెట్ చేస్తూ మోదీ ప్రసంగించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ లో మోదీ పర్యటన ఖరారు అయ్యింది. అనకాపల్లి, రాజుల పాలెం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ వెంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు.
మోదీ తన ప్రసంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నోరు మెదిపే అవకాశాలపై జనం ఆసక్తితో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని సభ సాక్షిగా స్పష్టమైన హామీ ఇచ్చే ఆలోచన గురించి రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు కూడా మౌనంగానే ఉన్నారు. ఇదే సభలో బీజేపీ తో వైసీపీ కి ఎలాంటి మిత్రబంధం లేదని చెప్పగలరా అని కూడ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. ఇటీవల చిలకలూరి పేటలో వైసీపీ పార్టీ గురించి కానీ, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి కానీ పల్లెత్తు మాట అనలేదు. ఇప్పడు కూడా అదే బాటలో నడుస్తారా, లేదంటే సిద్ధంగా ఉన్న వైసీపీ తో యుద్ధం చేస్తామని ప్రకటిస్తారా అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అనకాపల్లి బహిరంగ సభ కూటమికి అనుకూలమా, లేదంటే వైసీపీ కి అనుకూలంగా మోదీ సభను సద్వినియోగం చేనున్నారా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
మోదీ తెలంగాణ లో కేసీఆర్, రేవంత్ రెడ్డి లపై దూకుడుగానే ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తోపాటు కేసీఆర్ ను లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే పద్దతిని అవలంబిస్తారా లేదా చూడాల్సిందే.