31.6 C
India
Sunday, May 19, 2024
More

    Telugu votes : కర్ణాటకలో తెలుగు ఓట్లు ఎటు పడ్డాయో తెలుసా..?

    Date:

    Telugu votes
    Telugu votes

    Telugu votes : కర్ణాటకలో ప్రభుత్వ బదిలీ కామనే అయినా ఓట్ల శాతంపై సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. బీజేపీ తన ఓటు బ్యాంకును కొంచెం వరకు కోల్పోగా జేడీఎస్ భారీగా నష్టపోయింది. దీంతో మధ్యలోని కాంగ్రెస్ భారీ మెజార్టితో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే కర్ణాటకలో ఉన్న తెలుగు వారు ఓటు ఎటువైపు వేశారు అన్న సదేహం ఇప్పుడు అందరినీ తొలిచివేస్తుంది. ఎందుకంటే ఈ నెల చివరలో తెలంగాణకు, వచ్చే నెలలో ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ వివాదాంశంగా మారింది.

    అయితే కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వచ్చిన ఓటర్లు బీజేపీకి ఓటు వేయలేదు. గతంలో కర్ణాటకకు ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ నేతలు అక్కడ ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేయద్దని ప్రచారంలో కర్ణాటక ఓటర్లను అభ్యర్థించారు. కానీ ఈ సారి వారు ప్రచారంలో పాల్గొనలేదు. దూరంగా ఉండిపోయారు.  అయినా కన్నడ ఓటర్లు మాత్రం బీజేపీని దూరంగా ఉంచారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా తెలుగు వారున్నారు. దాదాపు 8 జిల్లాల వరకూ తెలుగు ఓటర్ల మెజారిటీనే ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాల్లో మొత్తం 49 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే అందులో బీజేపీ గెలుచుకుంది కేవలం 6 సీట్లు మాత్రమే అంటే సందేహం కలుగక మానదు. ఈ జిల్లాల్లో కోలార్, యాద్గిర్, చిక్ బళ్లాపూర్, బళ్లారి జిల్లా్లో కూడా బీజేపీ ఖాతా తెరవనే లేదు. ఈ ఫలితాలు బీజేపీ హైకమాండ్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది.

    అయితే అక్కడ ఉన్న తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకపోవడానికి అక్కడి రాజకీయ అంశాలే కారణం కానీ.. తెలుగు రాజకీయాలు వారిని ప్రభావితం చేసి ఉండబోవని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండడం వల్లే కాంగ్రెస్‌కు ఓటు వేశారంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల తరహాలో కాకపోయినా.. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీ బలంగా లేదు. కానీ ఈ సారి అధికార పార్టీగా ఆధిపత్యం చెలాయిస్తుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ అనంత లోకాలకు – రైలు ఢీకొని తల్లీకుమారుడు మృతి

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ రైలు ఢీకొని అంగన్...