Tollywood Heroine : టాలీవుడ్ ను శాసించే హీరోలైనా.. హీరోయిన్ల అయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా బాల్యంలో ఇంత పెద్ద ఆచివ్ మెంట్ చేస్తామా? అన్న సందేహం వేయక మానదు. మొన్న ఆహాలో జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ ఒక మాట చెప్పాడు. ‘స్కూల్ లో హెడ్మాస్టర్ చేత ప్రోగ్రెస్ కార్డ్ తీసుకునేందుకే భయపడే మనం ఈ రోజు ప్రెసిండెంట్ తో ఉత్తమ హీరో అవార్డు తీసుకోవడం’ నిజంగా ఒక కిక్కే అన్నాడు. బాల్యంలో ఎవరు ఏమవుతారన్నది తెలియదుగా..
సోషల్ మీడియా భారీగా విస్తరిస్తున్న ఈ జమానాలో ఇన్ స్టా, వెబ్ ఛానల్ లలో క్విజ్ క్వశ్చన్స్ అడపా దడపా కనిపిస్తూనే ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి హీరోల కంటే హీరోయిన్ల బాల్యంలోని ఫొటోలే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే ఇది పోస్ట్ చేసేది ఎక్కువ పురుషులు కాబట్టి జెండర్ అట్రాక్షన్ తో హీరోయిన్ల బాల్యం ఫొటోలు అప్ లోడ్ చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది.
ఇదిగో ఈ ఫొటో గుర్తు పట్టారా? అంటూ ఒక ఫొటో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో ఉన్నది ఒక క్యూట్ లిటిల్ గర్ల్. ఈమె ఒక హీరోయిన్.. ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్. మహారాష్ట్రలో నుంచి స్ట్రైట్ గా తెలుగులోకి దూకింది. మలయాళం మినహా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలను చుట్టేసింది. ఆమె కళ్లే మాట్లాడతాయని టాక్ ఉంది.
హిందీలో కూడా ఒక సినిమాలో కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ దైవ చింతనలో గడుపుతున్నట్లు కనిపిస్తుంది. అనారోగ్యంగా కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నటి ఎవరంటే ‘హంసా నందిని’. ‘ప్రతి దినం నీ దర్శనం..’ అంటూ డైరెక్టర్ వంశీ చేసిన ‘అనుమానాస్పదం’లో కనిపించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీకి ముందు రెండు, మూడు సినిమాలు చేసినా అవి అంత గుర్తింపు దక్కించుకోలేదు.
అనుమానాస్పదం తర్వాత ప్రవరాఖ్యుడు, నా ఇష్టం, ఆహ నా పెళ్లంట, ఈగ వంటి చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్ లో కనిపించింది. ప్రభాస్ మిర్చిలో ‘మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే’ సాంగ్లో చిందులేసింది. ఇక్కడి నుంచి ఆమెకు ఐటం, స్పెషల్ సాంగ్స్ అవకాశాలు మాత్రమే వచ్చాయి. భాయ్, అత్తారింటికి దారేది, లెజెండ్, రామయ్య వస్తావయ్య, శ్రీరస్తు శుభమస్తు, బెంగాల్ టైగర్ తదితర చిత్రాల్లో హీరోలతో చిందులేసింది. దాదాపు ఈ సినిమాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే చాలు ఆ సినిమా హిట్ అన్నా టాక్ సంపాదించుకుంది. గోపీచంద్ లౌక్యంలో బ్రహ్మానందం (సిప్పీ) భార్యగా నటించింది. రుద్రమదేవీ, పంతం, జై లవకుశలో కూడా నటించింది.
హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. క్యాన్సర్ ను జయించి మళ్లీ సినిమాల్లోకి వస్తానని ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకొని మానసికంగా, శారీరకంగా ధృడంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త చిత్రాలకు సైన్ చేసిన దాఖలాలైతే కనిపించడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం.. పిక్స్, రీల్స్, వీడియోలతో రచ్చ లేపుతోంది.