TDP-Janasena : తెలుగుదేశం పార్టీ – జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళంలో జరిగిన ‘రా.. కదలి రా’ సభలో చంద్రాబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెప్పారు. జగన్ మాటలను నమ్మి ఆయన ఉచ్చులో పడొద్దని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెర తీసింది.
జగన్ కూటమిని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందా..? అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి జగన్ భయపడుతున్నారా? అందుకే చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను విడదీయాలని జగన్ ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు ఇప్పుడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో అన్నీ సాధ్యమే. అందువల్ల చంద్రబాబు భయాలను కూడా తోసిపుచ్చలేం. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులను వైసీపీ రెచ్చగొట్టి, పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు పవన్ కల్యాణ్ ను టీడీపీకి దూరం చేస్తుందని అధినేత భయపడుతున్నట్లు తెలుస్తోంది. తన పార్టీని గోడకు నెట్టే అవకాశాలు, అంశాలపై చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో రాజకీయం చాలా హీట్ గా కనిపిస్తుంది. ఇక నెల రోజులు మాత్రమే షెడ్యూల్ వచ్చేందుకు గడువు ఉండడంతో నాయకుల్లో గుబులు మొదలైంది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈసారి పోరు ఉండబోతోందని తెలుస్తుంది. ఇందులో బీజేపీ ఎవరికి సపోర్ట్ ఇస్తుందన్నది తెలియదు. ఇప్పటికైతే బీజేపీ నర్మగర్భంగా వ్యవహరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.