Ethanol Cars : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను కట్టడి చేసేలా రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో జరిగిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఇంధన ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్ర సర్కారు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో ఇథనాల్ తో నడిచే కొత్త కార్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్తో ఈ కార్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
60 శాతం ఇథనాల్.. 40 శాతం విద్యుత్ వినియోగంతో సగటున పెట్రోల్ ధర రూ. 15. దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. దీని విలువ మొత్తం రూ. 16 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ డబ్బంతా రైతుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. తద్వారా దేశంలోని రైతులు మరింత అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.