Maldives : ఇండియా శుభ్రంగా ఉండదని అవమానించిన మాల్దీవులకు ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చింది. మన దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈజ్ మై ట్రిప్ సంస్థ వెల్లడించింది. కాగా మాల్దీవులకు ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకునే అవకాశం తక్కువగా ఉన్నా కొత్త బుకింగ్స్ భారీగా తగ్గాయని అంచనా వేస్తున్నారు.
మొత్తం మీద మాల్దీవుల కు భారత దేశానికి చెందిన వారు అదేవిధంగా నటులు అక్కడికి వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. కొందరు మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకున్నామని చెప్పారు. భారతదేశంలో పై అక్కడి మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం మంత్రులపై చర్యలు తీసుకుందని సమాచారం అందుతుంది. ఏది ఏమైనా భారత దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు.