Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా మారింది. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలోని వరంగల్, జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, గద్వాల జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయను వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు ర్ోజుల్లో ఈ జిల్లాలలో 46 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.