దివ్య పహుజాను ఆమె బస చేసిన సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజీత్ సింగ్ హత్య చేశాడు. అభిజీత్ సింగ్ సహచరులు హేమరాజ్, ఓం ప్రకాశ్ తన హోటల్లో పనిచేస్తుండగా, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు రూ.10 లక్షలు అందజేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.
సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజీలో దివ్య మృతదేహాన్ని బూట్ లో మోసుకుంటూ నీలం రంగు బీఎండబ్ల్యూ కారులో నిందితులు పరారయ్యారు. అభిజీత్, ఇంకా కొందరు దివ్య మృతదేహాన్ని షీట్ లో చుట్టి హోటల్ లోపలికి ఈడ్చుకెళ్లారు.
దివ్య వద్ద కొన్ని అభ్యంతరకర చిత్రాలు ఉన్నాయని, వాటిని చూపించి ఆమె తన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని పోలీసుల విచారణలో అభిజీత్ వెల్లడించినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి అభిజీత్ తన మొబైల్ ఫోన్ నుంచి తన అభ్యంతరకర చిత్రాలను తొలగించాలని దివ్యకు చెప్పాడు. అయితే ఆమె తన మొబైల్ పాస్ వర్డ్ ను చెప్పడం, అందులోని అభిజీత్ కు సంబంధించి చిత్రాలను తొలగించేందుకు నిరాకరించింది. దీంతో అతను తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెను కాల్చి చంపాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది.