Medigadda Barrage : తెలంగాణ మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం మెడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించింది. మేడిగడ్డ లో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయ మూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపు తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం కూడా చేసింది. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ కూడా ఇవ్వడం జరిగింది.
నీటి పారుదల శాఖ కార్యాలయాలలో తనికీలతో మెడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగింది దాని గల కారణాలను ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని ఆయన తెలిపారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మేడిగడ్డ నిర్మిస్తే హఠాత్తుగా కుంగిపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్టులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని త్వరలో వారిని విషయాలు బయటపడతాయి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు.