Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు, పవన్ శనివారం (ఫిబ్రవరి 24) రోజున రిలీజ్ చేశారు. ఈ జిబితాలో జనసేనకు అసెంబ్లీకి సంబంధించి 24, పార్లమెంట్ కు సంబంధించి 3 సీట్లు దక్కాయి. జనసేనకు సంబంధించి సీట్లలో ఐదుగురు అభ్యర్థులను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా 19 మంది పేర్లు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న విషయాలను ప్రకటించలేదు.
బాబు మాత్రం 94 మంది పేర్లను ప్రకటించారు. తాను మళ్లీ కుప్పం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే.. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు రాజకీయ ఎనిమీ జగన్ మాత్రమే. దీంతో జగన్ పై ఎవరిని పోటీకి దింపుతున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. దీంతో ఈ రోజు జాబితాలో ఈ సస్పెన్స్ కు బ్రేక్ వేశారు బాబు. సీఎం జగన్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం పులివెందుల నుంచి టీడీపీ లీడర్ మారెడ్డి రవీంద్రనాథ్ అలియస్ బీటెక్ రవిని బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో పులివెందుల రాజకీయాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అసలు ఎవరీ బీటెక్ రవి..
కడప జిల్లా, కసునూరు గ్రామానికి చెందిన మారెడ్డి కృష్ణా రెడ్డి-సరస్వతమ్మ కుమారుడే రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి). టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆది నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 1992లో కర్ణాటకలోని ధార్వాడ్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశారు రవి. అప్పటి నుంచి ఆయనను బీటెక్ రవి అని పిలుస్తుంటారు. 2011 ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వివేకానంద రెడ్డిపై పోటీ చేసి గెలిచారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉండే పులివెందుల నుంచి బయటి నుంచి పోటీ చేసి గెలుపొందాడు రవి. అప్పటి నుంచి పార్టీలో ఆయనకు క్రేజ్ పెరిగింది. ఈ ఎన్నికల్లో (2024) సీఎం జగన్ ఎక్కడ పోటీ చేస్తే తానూ.. అక్కడే పోటీ చేస్తానంటూ రవి చెప్పుకస్తున్నారు. పులివెందులలో రవికి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది. దీంతో అతన్ని దింపితేనే బెస్ట్ అంటూ డిసైడ్ అయ్యారు చంద్రబాబు. దీంతో పులివెందుల అభ్యర్థిగా రవి పేరునే ప్రకటించారు. కానీ జగన్ పై పోటీ అంటే వివేకానందతో పోటీ పడ్డంత ఈజీ కాదు. ఎన్నికల్లో పులివెందుల ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.