2024 ఎన్నికలే టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనానీ పావులు కడుపుతున్నారు..అయితే పవన్ కళ్యాణ్ అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి. ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నాడు.. బీజేపీ తో వెళ్తే ఓట్లు చీలడం తప్ప మరో లాభం లేదని భావిస్తున్నారు… అయితే ఇదే జరిగితే మళ్ళీ 2019 ఎన్నికల్లో మాదిరిగా వైసీపీ కి లాభం చేకూరుతుందని పవన్ ఆలోచన… ఎట్టి పరిస్థితిల్లో ఓట్లు చీలానివ్వనని పవన్ పలు మార్లు చెప్పకనే చెప్పారు… అందుకోసం తాను తగ్గడానికైనా సిద్దమే అన్న సాంకేతాలు ఇచ్చారు..
అయితే నిన్న సుమారు గంటన్నరపాటు బాబు, పవన్ లా మధ్యలో సమాలోచనలు జరిగాయి. ఒన్ టు ఒన్ సమావేశంలో పొత్తుతో పాటుగా బీజేపీ వ్యవహార శైలి పైన చర్చలు చేసారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా మరోసారి చంద్రబాబు – పవన్ కల్యాణ్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలే ఓపెన్ గా అన్ని అంశాల పైన కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో ఏపీలో బీజేపీ, జనసేనతో పాటుగా టీడీపీతోనూ కలిసి వెళ్లేలా ప్రతిపాదన చేసారు. 2014 ఎన్నికల తరహాలో పొత్తుల ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, అదే సమయంలో మూడు పార్టీలకు మేలు జరిగేలా కార్యచరణ వివరించారు. దీని పైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదని సమాచారం.
కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు జరుగతుందడంతో బీజేపీ నాయకత్వం ఇప్పుడు పూర్తిగా కర్ణాటక ఎన్నికల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో ఎటువంటి ప్రతిపాదనలు..చర్చలకు అవకాశం లేదని ఇద్దరు నేతలు నిర్దారణకు వచ్చారు.కర్ణాటక ఎన్నికల తరువాత మరోసారి బీజేపీ నేతలతో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లి చర్చలు చేస్తానని పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ నిర్ణయం తీసుకొనే వరకూ రెండు పార్టీల పొత్తు గురించి అధికారికంగా ప్రకటన కోసం తొందర అవసరం లేదని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. మే ద్వితీయార్ధంలో బీజేపీ కలిసి వస్తూ మూడు పార్టీల పొత్తు, లేకుంటే టీడీపీ-జనసేన పొత్తుతో పాటుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే పార్టీ మహానాడులో పొత్తుల పై న ప్రకటన చేయాలని నిర్ణయించిట్లు సమాచారం.