PM Modi’s Birthday Celebrations :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని వన్ టౌన్ విలాస్ సెంటర్లో జరిగిన వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోడీ దేశ సేవకుడని కొనియాడారు.
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బీజేపీ సిద్ధాంతాల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం రాజకీయాలు మారుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే రాజకీయాలు చేస్తున్న తరుణంలో అందరి కోసం మోడీ పలు పథకాలు ప్రవేశపెడుతున్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
చేతి పనుల వారికి కూడా పలు పథకాలు తెస్తున్నారు. మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. దీని కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి ఎన్ని కుట్రలు పన్నినా చివరకు విజయం తమదేనని చెప్పారు. 12 పార్టీల కూటమిలో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి.
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. పేదవారి క్షేమం కోసం పలు పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కానీ కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో బీజేపీకి పేరు రాకుండా చేస్తున్నాయి. బీజేపీ నేతలు ఇంటింటా తిరిగి పథకాలను ప్రచారం చేస్తే మనకే విజయం దక్కుతుంది. దక్షిణాదిలో పట్టు సాధించాలని చూస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిందే.