Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. బుధవారం పోసాని కృష్ణమురళి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు పేదల జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఇదంతా సీఎం జగన్ చిత్తశుద్ధితో చేస్తున్నారని పోసాని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా..? ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉందన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే 18 సీట్లు వచ్చాయి. ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా..? ఇప్పుడు పవన్ ని గెలిపించాలని ఎలా అడుగుతారు.? అని ప్రశ్నించారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని, ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్లీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారని అన్నారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు ఎంతో మంది కాపులు బలయ్యారని, చిరంజీవి ఆత్మ పరిశీలన చేసుకోవాలని పోసాని కృష్ణమురళి హితవు పలికారు.