35.3 C
India
Wednesday, May 15, 2024
More

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    Date:

    TDP-Janasena
    TDP-Janasena

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతున్నాయి. బాబు, పవన్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. జగన్ సామాజిక లెక్కలే ఇన్ చార్జిలను మారుస్తున్నారు. అధినేత చంద్రబాబు 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కొందరు సీనియర్ల సీట్లను పెండింగ్ లో ఉంచారు. జాబితాలో సామాజిక లెక్కలు ఇప్పుడు జగన్ సమీకరణాలను సరి చేస్తాయా? లేదా? అనే చర్చ మొదలైంది.

    సామాజిక లెక్కలు..
    సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. రీసెంట్ గా నియమించిన ఇన్ చార్జిల్లోనూ బీసీలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ జాబితా రిలీజ్ చేసింది. 99 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో పురుషులు 86, మహిళలు 13 మంది ఉన్నారు. టీడీపీ నుంచి తొలిసారి 24 మంది బరిలో ఉన్నారు. మరో 57 స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

    ఏ వర్గానికి ఎన్ని..?
    జనసేకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు. అందులో జనసేన అసెంబ్లీకి కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే అనౌన్స్ చేసింది. టీడీపీ + జనసేనలో సామాజిక సమీకరణాలను పరిశీలస్తే జగన్ కు ధీటుగానే కసరత్తు చేసినట్లు అర్థం అవుతోంది. బీసీ వర్గాలకు 20, ఎస్సీలకు 20 స్థానాలు రెండు పార్టీల నుంచి ఇచ్చారు. ఎస్టీలకు 3 స్థానాలు ఖరారు చేశారు. కాపులకు 10 స్థానాలు, కమ్మకు 21 స్థానాలు కేటాయించారు. వైశ్యకు 2 సీట్లు పరిమితం చేశారు. క్షత్రియ వర్గానికి టీడీపీ 4 సీట్లను ఖరారు చేసింది. ఇక, వెలమకు విజయనగరం జిల్లా, బొబ్బిలి మాత్రమే ప్రకటించారు.

    జగన్ లెక్కలు మారుతాయా?
    మైనార్టీలకు టీడీపీ ఒక్క నంద్యాల మాత్రమే కేటాయించింది. టీడీపీ+జనసేన తాజా జాబితాతో వైసీపీ అలర్ట్ అయ్యింది. వచ్చే నెల 3వ తేదీ అద్దంకిలో జరిగే ‘సిద్ధం’ సభ తర్వాత అభ్యర్థులు, మేనిఫేస్టోను ప్రకటిస్తామని వైసీపీ ప్రకటించింది. టీడీపీలో సీట్లు దక్కని ఆవావాహులను తమ వైపునకు లాక్కునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో ఇన్ చార్జిల్లోనూ మార్పులు ఉంటాయని వినిపిస్తోంది. తొలి జాబితాలో పవన్ పోటీ చేసే స్థానం ప్రకటించలేదు. జనసేన 23 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ పొత్తు పైనా స్పష్టత రావాలి. చంద్రబాబు లిస్ట్ ఖరారు కావడంతో.. జగన్ తన లిస్ట్ లో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

    Share post:

    More like this
    Related

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...