Bangla Lakshmikanth Reddy : బీజేపీ రాష్ట్ర కార్యవర్త సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆమె గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు.
ఎంపీ ఎన్నికల్లో అరుణ గెలిచాక మక్తల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులను, బూత్ అధ్యక్షులను విమానంలో అయోధ్యకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చులతో నాయకులందరినీ అయోధ్యకు విమానంలో తీసుకెళ్లి రామయ్య దర్శనం చేయిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి వారికి ఆఫర్ చేశారు. ఈ వారం రోజులు అవిశ్రాంతంగా కృషి చేయాలని మహబూబ్ నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.