Jagan: ప్రజా వ్యతిరేకత బయటపడుతుందనే పవన్ యాత్రపై కఠిన ఆంక్షలు..
ఇప్పటికే ఏపీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో తిరగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మూడో విడుత వారాహి యాత్ర సందర్భంగా ఏపీ పోలీసులు విధించిన ఆంక్షలు చూస్తుంటే సీఎం జగన్ భయమేంటో ఇట్టే అర్థమవుతున్నది.
ర్యాలీలు నిషేధం, రోడ్ షోలకు అనుమతి లేదని, రోడ్ల పక్కన భవనాలపై ప్రజలు నిల్చున్నా అది కూడా పవన్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనంటూ పెట్టిన ఆంక్షలు జగన్ లోని అభద్రతాభావాన్ని వెల్లడిస్తున్నాయి. కనీసం అభిమానులకు అభివాదం కూడా చేయొద్దంటూ కండీషన్లు పెడుతున్నారంటే జగన్ కు తన మీద తనకే నమ్మకం లేకుండా పోయినట్లు స్పష్టవుతున్నది.
విపక్ష పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తే ఏమవుతుందో జగన్ కు తెలిసిపోయినట్లుంది.
తాను చేస్తున్న తప్పులు జగన్ కు అర్థమవుతున్నాయి. అయితే వీటిని కప్పి పుచ్చడానికే జగన్ భద్రతా సమస్యలను బూచిగా చూపుతూ ప్రతిపక్ష నేతలు జనాలతో మాట్లాడనివ్వకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతూ ఆంక్షలు విధిస్తున్నారు.
ఈ ఒక్క సమస్య చాలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ట్యాక్సుల రూపంలో ఏపీ సర్కార్ నిట్ట నిలువునా ముంచుతోందని ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మూడో విడత వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ కారులో వెళ్తుండగా ఓ లారీ డ్రైవర్ పవన్ కారును ఆపి సమస్యలు వివరించారు.
గ్రీన్ టాక్స్ పేరుతో జగన్ సర్కారు చేస్తున్న దోపిడీని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లారీ డ్రైవర్ వివరించారు. తమిళనాడులో రూ. 200, తెలంగాణలో రూ. 500 తీసుకుంటున్నారని, ఏపీలో మాత్రం అడ్డగోలుగా రూ. 6660 గ్రీన్ టాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను గాజువాక బహిరంగ సభలో గ్రీన్ టాక్స్ బాదుడుపై మాట్లాడతానని పవన్ భరోసా ఇచ్చారు.
పవన్ వారాహి వాహనంపై యాత్ర చేస్తేనే సమస్యలు ఇలా బయటికి వస్తున్నాయంటే పవన్ కాలినడకన ప్రజల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో పవన్ ఈ దిశగా ఆలోచిస్తే పవన్ కు మరింత మైలేజీ వచ్చే అవకాశం ఉంది.