BJP వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. అధికారంలో ఉన్న వారి అండ ఉంటే ఏదైనా సాధ్యమే. పనుల్లో నాణ్యత చూపకపోయినా ఎవరు పట్టించుకోరు. దీంతో మనం అనుకున్నది చేయొచ్చు. ఎంత దూరమైనా వెళ్లొచ్చు. నాయకుల అండ ఉంటే చాలు ఎంతటి నిర్మాణాన్ని అయినా నాణ్యతలోపంగా నిర్మించొచ్చు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరేమన్నా అనుకుంటారోననే బెంగ కూడా అవసరం లేదు.
పడోదరలో రూ. 54 కోట్లతో నిర్మించిన ఓ వంతెన కూలడం జరిగింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ఏంటి కొత్తగా నిర్మించిన వంతెన ఇలా ఎందుకయిందని ఆశ్చర్యపోతున్నారు. ఈ వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన సంగతి విధితమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో నిర్మించిన వంతెన ఇలా కావడంపై అందరు అవాక్కవుతున్నారు.
ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నిర్మించిన వంతెన ఇలా కావడంతో ఇక ఏం చేసేది? వర్షాలకు శిథిలం కావడంతో నిర్మించిన పేరు కూడా లేకుండా పోయింది. ప్రభుత్వంలో పెద్దల అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా సాధ్యమే. ఏం చేసినా రక్షించేవారుంటే ఎన్ని తప్పులైనా చేస్తారు. ఎంతటి నేరమైనా చేసేందుకు వెనకాడరు. ఇలా రోడ్డుపై వంతెన నిర్మించినా అది మూన్నాళ్ల ముచ్చటే అయింది.
రూ.54 కోట్లు మట్టిలో పోసినట్లు అయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని అంటున్నారు. నిర్మాణంలో నాణ్యత లోపం ఏర్పడటం వల్ల వంతెన కూలినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతోనే కాంట్రాక్టర్ ఇలాంటి దురాగాతం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పనులు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిగా ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి.