Bigg Boss Is All Bogus : బుల్లితెరపై హయ్యస్ట్ టీఆర్పీని నమోదు చేసుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. సాధారణ వ్యక్తిని కూడా అసాధారణంగా మారుస్తున్న షో అంటే సందేహం లేదు. ఈ షో నుంచి వెళ్లిన వారు ఎంతో మంది సినిమాల్లో లీడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అలాంటి వాడే సీరియల్స్ లో నటించే కౌశల్. సీజన్ 2 టైటిల్ సంపాదించుకున్న ఆయన ఎంతలా పాపులర్ అయ్యారంటే ఆ షో జరుగుతున్న సమయంలో ఆయన కోసం ఒక ఆర్మీనే ఏర్పడిందంటే ఆశ్యర్యం వేయకమానదు. ఎంతో కొంత నెగిటివిటీని మూట గట్టుకున్నా.. పాపులారిటీ మాత్రం విపరీతంగా వచ్చింది. బిగ్ బాస్ గురించి గతంలో యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని మాటలు ఇప్పుడు వైరల్ గా మారతున్నాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా నా గురించి మాట్లాడినా.. గెలికినా నాకు కాలుద్ది. అలాంటిది దీప్తి సునయన నా గురించి మాట్లాడుతూ రెండు వారాల్లో కౌశల్ వెళ్లిపోతాడని అంది. అప్పుడు హోస్ట్ గా ఉన్న నాని ఆ దృశ్యాన్ని టీవీలో చూపించారో అప్పుడు నిర్ణయించుకున్నా నేనేంటో వీళ్లకు, వీళ్లతో పాటు ప్రపంచానికి చూపించాలని. ఆ సమయంలో రెండు వారాల్లో నేను వెళ్లిపోతానన్న ప్రోమోను కూడా కట్ చేశారు. శుక్రవారం రాత్రి 11 గం. ఓటింగ్ ముగిసిపోవడం.. ఆ సమయంలోనే నిమ్మకాయ ఎపీసోడ్ రిలీజ్ కావడంతో కేవలం ఒక గంటలోనే నా రాత మరింది. ఆ నిమ్మకాయ అప్పుడు పిండకుండా.. తర్వాతి ఎపీసోడ్స్ లో పిండి ఉంటే వారు అన్నదే జరిగేదేమో.
‘ఈ బిగ్ బాస్ షో అంతా బోగస్’ అంటూ అప్పట్లో ఒక ఛానల్ డిబేట్ లో కూడా కౌశల్ కామెంట్ చేశాడు. ఆ సమయంలో బిగ్ బాస్ లో ఆయన గెలుచుకున్న మనీని బిగ్ బాస్ తీసుకుంటుందని, తనను స్టూడియోకు రమ్మని ఏవేవో చేసినట్లు చెప్పాడు. ఈ షో అంతా బోగస్ అని కొన్ని కామెంట్లను గతంలో చూసినప్పుడే ఈ షోకు వెళ్లకుండా ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు కౌశల్. కానీ ప్రేక్షకులు ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి మన సైడ్ నుంచి ఎలాంటి తప్పు ఉండకూడదని స్టూడియోకు వెళ్లాను. ఈ విషయం సీరియస్ గా తీసుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోట్ల మంది ఈ షో చూస్తుంటారు. అందుకే వెళ్లాను లేదంటే వెళ్లేవాడిని కాదు అని చెప్పుకచ్చారు కౌశల్. ప్రస్తుతం ఆయన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.