Minister Seethakka : మిషన్ భగీరథ పై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క బహిరంగ లేఖను విడుదల చేశారు. గత ప్రభుత్వం కన్నా సమర్థవంతంగా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే స్వీకరి స్తామని అర్థం లేని విమర్శలు సరికాదని మంత్రి సీతక్క హెచ్చరించారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నీటి కొరత ఉందని దాన్ని ప్రభుత్వం పట్టించుకోవ డంలేదని గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు రాకుండా చేశామని కెసిఆర్ వ్యాఖ్యానించడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.