Modi in Lakshadweep : ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఆ దేశానికి ప్రధాని నరేంద్రమోడీ. ప్రకృతితో కలిసి బతకాలని చెప్తారు ఆయన. ఆయన ప్రతీ సారి ఏదో ఒక అడ్వెంచర్ ప్లాన్ చేస్తుంటారు. గతంలో బేర్ గిల్ తో కలిసి భారత్ లో ప్రధానమైన గిర్ అడవుల్లో తిరిగారు. ఈ అడ్వెంచర్ తో ఆయన ప్రపంచంలోనే గ్రేట్ పీఎం అనిపించుకున్నారు. ఇప్పుడు మరో అడ్వెంచర్ ప్లాన్ చేశాడు.
లక్ష ద్వీప్ లో స్నార్కెలింగ్ చేస్తూ, ఉదయాన్నే నడకను ఆస్వాధిస్తున్న అనుభవాన్ని ప్రధాని తన ఫొటోల ద్వారా భారత పౌరులతో పంచుకున్నారు. స్నార్కెలింగ్ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సాహసోపేతమైన స్ఫూర్తి ఉన్న వారు లక్షద్వీప్ ను తమ ప్రయాణ ప్రణాళికల్లో చేర్చుకోవాలని ప్రోత్సహించారు. లక్షద్వీప్ ప్రశాంతతను ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడటానికి ఆలోచించే క్షణాలను అందించింది.
ఈ పర్యటనలో భాగంగా రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. స్నార్కెలింగ్ సమయంలో ఎదురైన దిబ్బలు, సముద్ర జీవుల ఫొటోలను షేర్ చేశారు. అగట్టి, బంగారమ్, కవరత్తి గ్రామస్తులతో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షద్వీప్ లో తన ప్రయాణం అభ్యాసం, ఎదుగుదలకు సంబంధించిన సుసంపన్నమైన అనుభవంగా ఆయన అభివర్ణించారు.
లక్ష ద్వీప్ ప్రాముఖ్యతను కేవలం ద్వీపాల సమూహంగా మాత్రమే కాకుండా, కాలాతీత సంప్రదాయాల వారసత్వం, దాని ప్రజల స్థితి స్థాపక స్ఫూర్తిని నొక్కి చెప్పారు. లక్షద్వీప్ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది మెరుగైన అభివృద్ధి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, వేగవంతమైన ఇంటర్నెట్, తాగునీటి ద్వారా జీవితాలను ఉత్తేజపరచడం, శక్తి వంతమైన స్థానిక సంస్కృతిని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ఆయన ఈ పర్యటనలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ లక్ష్యాలను ప్రతిబింభిస్తాయి.
The biggest Brand ambassador of Indian tourism @narendramodi ji https://t.co/QJoQbsxMrx
— rohit Choudhary (@rohit_kadwa) January 4, 2024