G20 Summit :
ప్రస్తుతం మన దేశం పేరు ఇండియాకు బదులు భారత్ గా మార్చడంపై చర్చ నడుస్తోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో కూడా దీని మీద ప్రధాన చర్చ సాగుతోంది. దీంతో ప్రధాని కూర్చునే సీటు ముందు ఉన్న నేమ్ ప్లేట్ పై ఇండియాకు బదులు భారత్ అని పెట్టారు. దీంతో అందరిలో దీని మీదే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇండియా పేరును మార్చుతున్నారనే వాదనలు వస్తున్న నేపథ్యంలో భారత్ పేరుపై ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
భారత్ పేరు మార్పుపై ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో భారతదేశం పేరు భారత్ గా పెట్టడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి 1946-48 చర్చల్లో కూడా రాజ్యాంగంలో ప్రస్తావించబడింది. జీ20 బుక్ లెట్ లో కూడా భారత్ అనే ముద్రించారు. భారత్ అనేది అధికారికి పేరు. అందుకే దాని విషయంలో కేంద్రం గట్టిగానే ఉంది.
మోడీ కూర్చున్న స్థానంలో నేమ్ ప్లేట్ పైన కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. నేమ్ ప్లేట్ పై జోరుగా చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇండియా పేరు ఎందుకు నచ్చడం లేదని ప్రశ్నిస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండిపడుతున్నాయి.
జీ20 సదస్సు శనివారం 9న ప్రారంభించారు. మొరాకో భూకంపంలో చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని తీర్మానం ఆమోదించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో మొరాకోకు అండగా ఉంటామని తెలిపారు. ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జీ20 సదస్సు విజయవంతానికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ReplyForward
|