36.7 C
India
Thursday, May 16, 2024
More

    Lok Sabha elections : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీ హ్యాట్రిక్ ఖాయం 

    Date:

    Modi
    Modi
    Lok Sabha elections : దేశంలో ఎన్నికల సీజన్ మొదలైంది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అప్పుడే పార్టీల్లో ప్రచారం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్ లో బీజేపీ, చత్తీస్ గడ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్, మిజోరాంలో ఎన్ఎస్ అధికారంలో ఉన్నాయి.
    వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మోడీ చరిష్మా బీజేపీని గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ మాత్రం కిందా మీదా పడుతోంది. బీజేపీ హవాను తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడే వెల్లడిస్తున్నాయి.
    వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. మోడీ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మరోమారు భంగపాటుకు గురవుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ మిగతా పార్టీలన్ని కలిసి ఏకమైనా బీజేపీని ఏం చేయలేవని తెలుస్తోంది.
    సర్వేల్లో పాల్గొన్న వారిలో దాదాపు 52 శాతం మంది ప్రజలు మోడీ పాలనకు మొగ్గు చూపుతున్నారు. గతంలో నిర్వహించిన ఓ సర్వేలో ఏకంగా 72 శాతం మంది ప్రజలు మోడీ పాలనకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. మరోమారు మోడీ ప్రధాని కావడం ఖాయంగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడీ చరిష్మాతోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు తేలుస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...