Nara Lokesh : రాజకీయాల్లో ఎదగడం అంటే అంత సులువు కాదు. రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడి కొడుకైనా ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటేనే నిలబడతాడు. లేకపోతే అందరిలోనూ చులకన భావన తప్పదు. ఒక నాయకుడు మాట్లాడుతున్నాడంటే ఏం చెబుతాడోనని ప్రజలు ఆగిపోవాలి. అంతేకానీ ఎలా మాట్లాడుతాడో, ఏం కామెడీ చేస్తాడో చూద్దామనుకోకూడదు. అలాంటి అవమానకర ట్రోలింగ్స్ నుంచి ఇప్పుడు అధికార పార్టీ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే నాయకుడిగా ఎదిగాడు ఓ మాజీ సీఎం కుమారుడు. అతనే నారా లోకేశ్.
మార్పు ఎలా వచ్చింది..
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశాడు లోకేశ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు శ్రమించాడు. ఆయన టీంలో నారా లోకేశ్ కు సైతం మంత్రి పదవి వచ్చింది. కానీ అతనికి వాక్చాతుర్యం లేకపోవడంతో ఏం మాట్లాడినా వైసీపీ నాయకులు కామెడీగా తీసుకునేవారు. లోకేశ్ మాట తీరు అలా ఉండేది. ఈయనది స్టాఫ్ట్ మెంటాలిటీ. రాజకీయాల్లో అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భం.
యువగళంతో మార్పు..
ప్రతీ రోజు ఒకేలా ఉండదు.. ప్రతి వ్యక్తి కూడా ఒకేలా ఉండడం సాధ్యం కాలం, పరిస్థితులు, ప్రభావాలకు తగ్గట్లుగా మారక తప్పదు. పొలిటికల్ కమెడియన్ అన్న మార్క్ ను వేగంగా చెరిపేసుకున్నాడు. యువగళం పేరిట ప్రజల్లోకి వెళ్లిన లోకేశ్.. తన వేష, భాషనే కాదు.. మాటల్లోనూ తేడా చూపించారు. తన పాదయాత్రకు సీఎం జగన్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఛేదించి పరిపూర్ణ నాయకుడిగా ఎదిగాడు. తండ్రి జైలులో ఉన్న సమయంలో ఢిల్లీ నాయకులతో మంతనాలు జరిపారు. ఢిల్లీ స్థాయిలోనూ ఆయన రాజకీయ వ్యవహారాలు చక్కబెడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాడు. ఒకప్పుడు చిన్నమాట తడబడితే దాన్ని ట్రోల్ చేసేందుకు వేలాది మంది ఎదురు చూసేవారు. ఇప్పడు అలాంటి అవకాశం ఇవ్వ కుండా జాగ్రత్త పడుతున్నారు. పైగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న కౌంటర్లకు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు.