CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరి సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అధిష్ఠానం టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫొటో వద్దని చెప్పిందని పేర్కొన్నారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అందరికీ అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి కానీ మోదీ ఫొటో పెడితే ఒప్పుకోమని స్పష్టం చేసిందని అన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురి ఫొటోలను మేనిఫెస్టోలలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని, ఆయన హామీలు మోసమని తేలిపోయిందని సీఎం జగన్ మండిపడ్డారు.
అయితే మంగళవారం ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్ధార్థ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.