Nurse Jailed : రోగుల ప్రాణాలను కాపాడడం ఆమె వృత్తి. కానీ ఆమె మాత్రం రోగులను హతమార్చింది. అది కూడా ఉద్దేశపూర్వకంగానే.. ఇలా 17 మంది రోగులను చంపింది. 2020 మరియు 2023 మధ్య 5 వేర్వేరు హాస్పిటల్స్ లలో పని చేసింది అన్ని చోట్ల హత్యలు చేసింది. కోర్టులో ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆమె అంగీకరించింది.
పెన్సిల్వేనియాకు చెందిన 41 ఏళ్ల నర్సు హీథర్ ప్రెస్డీ గత 3 సంవత్సరాలలో 22 మంది రోగులకు అధిక మోతాదులో ఇన్సూలిన్ ఇచ్చిందని ఆరోపించింది. చాలా సందర్భాల్లో ఆమె హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు అర్థరాత్రి ఇన్సులిన్ను అధిక మోతాదులో తీసుకునేది. అదనంగా, మధుమేహంతో బాధపడని రోగులకు కూడా నర్సు ఇన్సులిన్ను అధిక మోతాదులో ఇచ్చింది.
ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల గుండె వేగం పెరిగి గుండెపోటు వస్తుంది. గతేడాది మేలో నర్సు పట్టుబడింది. పోలీసులు విచారణ జరిపి నర్సుపై మరిన్ని కేసులు పెట్టారు.
విచారణలో, నిందితురాలు నర్సు తన తల్లికి పంపిన టెక్స్ట్ సందేశాలలో ఆసుపత్రిలోని రోగులు, సహచరులు, రెస్టారెంట్లలో కలుసుకున్న వ్యక్తుల పట్ల కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వారికి హాని చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేసింది.
సాక్షులను విచారించిన యూఎస్ కోర్టు అమెరికన్ నర్సు హీథర్ ప్రెస్డీ రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి చంపినందుకు దోషిగా నిర్ధారించింది. ఆమెకు 380 నుంచి 760 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.