Pawan Kalyan : ఈనెల 20 న లేదా 23 తారీకు ల్లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని జనసే న నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి కి వచ్చి ముద్రగడ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన తెలిపారు. ఒక ఉద్యమ నేతని స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారని శ్రీనివాస్ తెలిపారు. జనసే నలో చేరడానికి ముద్రగడ పద్మనాభ ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ముద్రగడ పార్టీలోకి చేరుతారని శ్రీనివాస్ వెల్లడించారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం కోసం పలు పార్టీ ల నేతలు కలిసినా ముద్రగడ మాత్రం ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు. అయితే జనసేన నాయకులు కలిసిన నేపథ్యంలో ముద్రగడ వారి పార్టీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు పలుమార్లు ముద్రగడతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యలోనే దాదాపు గా ముద్రగడ జనసేన లోకి చేరుతారని స్పష్టమైనది. రాజకీయo మొత్తం ముద్రగడ చుట్టు తిరుగుతూ ఉన్న నేపథ్యం లో ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవా ల్సిన పరిస్థితి కలిగింది. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత పార్టీలో ఎప్పుడు చేరుతారన్న అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.