Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ధ్వంసం చేయడం కలకలం రేపింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పొన్నూరు పర్యటన కోసం హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ లో ఆదివారం ఉదయం 9 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పవన్ సభ కోసం, హెలిపాడ్ అనుమతుల కోసం కూటమి నేతలు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అధికారులు ఇటీవల సీఎం జగన్ పొన్నూరు బహిరంగ సభకు వచ్చవన సందర్భంగా సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిపాడ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హెలిపాడ్ ఖాళీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈలోపే కొందరు వ్యక్తులు హెలిపాడ్ ను తవ్వేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని కూటమి నేతలు చెప్పారు. అయితే ఇదంతా స్థానిక వైసీపీ నేతల పనిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ఎలా వాడుకుంటారంటూ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని చెప్తున్నారు. హెలిపాడ్ ధ్వంసం చేయడంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.