Pithapuram : పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని చూసి వేద పండితులు పులకించిపోయారు. పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన వేద బ్రాహ్మణులు పవన్ కళ్యాణ్ ను చూసి ఒక్కసారిగా పూనకంతో ఊగిపోయిన ఘటన పిఠాపురంలో చోటుచేసు కుంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది.
పిఠాపురం నుంచి తాను బరిలో ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను గెలిపించేందుకు ప్రచారం నిర్వహిస్తు న్నారు. కేవలం ప్రజలే కాదు పవన్ కళ్యాణ్ అంటే పురోహితులు కూడా ఎంతో అభిమానిస్తారో ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.