Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు మరో వ్యక్తిని కూడా చార్జిషట్ లో నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎస్ఐబీల్ోని హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అని.. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.