Telangana BJP :
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ అధ్యక్షుడి మార్పు తర్వాత ప్రస్తుతం పార్టీ కొంత నైరాశ్యం లోకి వెళ్లినట్లు కనిపిస్తున్నది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీలో 26 మందికి చోటు కల్పించింది. ఐదుగురు కేంద్రమంత్రులు సహా బీజేపీ ముఖ్య నాయకులకు ఇందులో చోటు దక్కింది.
అయితే వచ్చే వారంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ సభల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో బీజేపీ నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతను కమిటీ తీసుకోనుంది, కాగా, ఈ కమిటీలో ఏపీకి చెందిన మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కి కమిటీలో స్థానం కల్పించారు. జాతీయ నేత హాజరయ్యే సభలకు స్థానిక నేతలతో సమన్వయం చేసుకోనున్నారు.
ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలను ఈ ప్రత్యేక కమిటీలోకి తీసుకున్నారు. తెలంగాణలోని ఆయా జిల్లాల్లో ఈ నేతలు పర్యటించి, ఓటర్ల తో మాట్లాడే అవకాశం ఉంది. ఈ 26 మంది నేతలు కూడా తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ నేతలంతా ఇక్కడే మకాం వేయనున్నారు. అక్టోబర్ 5న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ 26 మంది. నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాగా ఈ 26 మంది నేతలతో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, జాతీయ నాయకుడు తరణ్ చుగ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాడు. ఇక రెండు, మూడు రోజుల్లో కమిటీ రంగంలోకి దిగనుంది.