Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు బంగారు నగలు కూడా పట్టుబడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించన తనిఖీల్లో బంగారం భారీగా పట్టుబడింది. కంచికచర్ల మండలం పెరకలపాడు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి. సుమారు 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే విజయవాడలోని పలు ప్రముఖ బంగారం దుకాణాలకు అందజేసేందుకు ఈ ఆభరణాలను తీసుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అదుకున్న ఇన్ కం టాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బంగారు, వెండి ఆభరణాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.