Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎంకు పూజలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఈ విషయంపై సంహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసు నమోదయింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ కు మహాయుతి కూటమి బారామతి లోక్ సభ సీటును ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం రూపాలి చకంకర్ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. అయితే, మంగళవారం ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రూపాలి చకంకర్ ప్లేటు, దీపం తీసుకువచ్చారు. ఈవీఎం వద్ద పూజలు చేశారు. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.