Prabhas Panchekattu : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అంటే ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.. ఈయన పబ్లిక్ ప్లేస్ లలో కనిపిస్తే ఫ్యాన్స్ ను కట్టడి చేయడం పోలీసులకు సైతం చాలా కష్టం.. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ తిరుపతిలో అడుగు పెట్టారు.. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? కష్టమే.. అందుకే ఫ్యాన్స్ అంతా ప్రభాస్ ను చుట్టుముట్టి హంగామా చేసారు.
ప్రభాస్ తాజాగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది కూడా పంచెకట్టుకుని ఆయన దేవాలయానికి చేరుకున్నారు.. మరి ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు.. ఈ క్రమంలో ఫ్యాన్స్ ను అదుపు చేయలేక పోలీసులు చాలానే కష్టపడ్డారు.. ఫ్యాన్స్ ఒక్కసారిగా మోహరించడంతో ప్రభాస్ ను పోలీసుల వాహనంలో పంపించారు.
ఆ తర్వాత ప్రభాస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా ఫ్యాన్స్ భారీగానే మోహరించారు. ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ చాలానే కష్ట పడుతున్నారు.. తిరుమలలో ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రభాస్ బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకే ప్రభాస్ తో పాటు, ఆదిపురుష్ మేకర్స్ అంతా తిరుపతి విచ్చేసారు. దీంతో తిరుపతికి ఒక్కసారికి సినీ గ్లామర్ వచ్చేసింది. ఈ రోజు మొత్తం తారల సందడితో తిరుపతి చాలా కోలాహలంగా ఉండనుంది. చూడాలి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరగనుందో..