Raj Thackeray : లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో శరవేగంగా ఈక్వేషన్లు మారుతున్నారు. మహా రాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA)లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎం ఎన్ఎస్ చీఫ్ను బీజేపీ ముంబై చీఫ్ ఆశిష్ షెలార్ సోమవారంనాడు కలుసుకున్నారు. లోక్సభ ఎన్ని కలు సమీపిస్తున్నందున ఎన్డీయేతో చేతులు కలపా లని రాజ్థాకరేను షెలార్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో మహారాష్ట్రకు చెందిన నేతలకు రాజ్ థాకరేతో చర్చలు జరపాలని పార్టీ అధిష్ఠానం సూ చించినట్టు వారు చెబుతున్నారు.
బీజేపీ తరహాలోనే ఎంఎన్ఎస్ సైతం హిందుత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటంతో కూటమిలో ఎంఎన్ఎస్ను కలుపుకొని వెళ్లాలని బీజేపీ ఆలో చనగా ఉందని అంటున్నారు. ఎంఎన్ఎస్కు 7 నుంచి 8 శాతం మరాఠా ఓటర్ల మద్దతు ఉందని, ఈ ఓట్లను ఎన్డీయే రాబట్టుకుంటే అది బీజేపీకి ప్రయోజనకారిగా ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు.
బీజేపీ, ఎంఎన్ఎస్ మధ్య పొత్తుపై ఇరుపార్టీలు బహిరంగంగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయ నప్పటికీ సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగవ చ్చని చెబుతున్నారు. రాజ్థాకరేతో చర్చలు జరి పామని, ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జ రుగుతుందని మీడియాతో మాట్లాడుతూ షెలార్ చెప్పారు.