NTR Coin :
తెలుగు జాతి బతికున్నంత వరకు గుర్తుంచుకొనే ఆరాధ్య దైవం, అన్న, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంత్ర సందర్భంగా ఈ రోజు ఆయన పేరుతో రూ. 100 నాణెన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము ఈ నాణెన్ని విడుదల చేశారు. రాష్ర్ట పతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా, అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, తెలుగు వారందరూ గర్వించేలా నాణెన్ని విడుదల చేశారు.
కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు హాజరయా్యరు. అయితే సభా వేదికపై మాత్రం ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లకు మాత్రమే చోటు కల్పించారు. అలాగే కుటుంబం తరఫున కుమార్తె పురందేశ్వరికి మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఇక రాష్ర్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ తమ తండ్రి పేరిటా నాణ్యం విడుదల చేయడం శుభ్రపదమైన రోజని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు వారి గుండెల్లో తమ తండ్రి ఎన్టీఆర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని పురందేశ్వరి తెలిపారు. దేశ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక పేజీ ఉందని పేర్కొన్నారు. సినిమారంగంలో ఆయన చేసిన పాత్రలు మరెవరికీ సాధ్యం కావని, కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా, తిరుపతిలో మహిళా యూనివర్షిటీ, పేదలకు ఎన్నో వరాలు ఇలా ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా హీరో అని పేర్కొన్నారు. తెలుగు సినిమాల ద్వారా భారతీయ సంస్కృతిపై చెరగని ముద్ర వేశారని రాష్ర్టపతి ముర్ము అన్నారు. భారత రాజకీయాల్లో ఆయనో కీలక అధ్యాయం లిఖించుకున్నారని కొనియాడారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ పేదల పట్ల ఉదారత ప్రదర్శించే వారని పేర్కొన్నారు.