Telangana Bhavan : బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ. న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖ టీ న్యూస్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. పార్టీ ఆఫీస్ నుంచి టీ. న్యూస్ ఛానల్ ను ఎప్పటిలో గా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్చార్జ్ శ్రీనివాన్రెడ్డిని ఆదేశించారు.2011 నుంచి టీ.న్యూస్ ఛానల్ ను BRS భవన్లో నే యాజమాన్యం నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలోని భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీ న్యూస్ కి అనేకమైన వాణిజ్య ప్రకటనలు కూడా ఇచ్చారని సమాచారం అందుతుంది.