India vs West Indies :
వెస్టిండీస్ తో మరికొన్ని గంటల్లో మొదలు కానున్న టెస్ట్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. డొమనికా స్టేడియం వేదిక గా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే రహానే, రుత్ రాజ్ జట్టులో రోహితో పాటు అజింక్యా గైక్వాడ్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి.. యశస్వీ జైస్వాల్, అక్షర్ పటేల్, జయచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ ఖాన్, శ్రీకర్ భరత్, జయదేవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, నవదీప్ శైనీ, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. వీరిలో ఏ 11 మందికి అవకాశం వస్తుందనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చ సాగుతున్నది. మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ మొదలుకానున్నది.
అయితే ఓపెనర్ గా రోహిత్ తో కలిసి యశస్వీ జైస్వాల్ పేరు దాదాపు ఖరారైంది. శుభ్ మన్ గిల్ ఇక మూడో స్థానానికి పరిమితమవుతాడు. తనకు అదే స్థానం ఇష్టమని శుభ్ మన్ గిల్ కోచ్ రాహుల్ తో చెప్పినట్లు సమాచారం. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో స్థానంలో అజింక్యా రహానె ఉన్నారు. అక్షర్ పటేల్, జడేజా, అశ్విన్లో ఇద్దరు ‘ స్పిన్నర్లకు చాన్స్ కు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక ఆరో స్థానంలో జడేజా ఖాయంగా కనిపిస్తున్నది. అశ్వన్ కూడా చాన్స్ ఉంటుంది. ఇక ఏడో స్థానంలో వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు చాన్స్ ఉంటుంది.
ఎనిమిదోస్థానంలో అశ్విన్ ఆడతాడు. ఇక ముగ్గురు పేసర్లమ జట్టులోకి తీసుకుంటారు. ఇందులో సీనియర్ మహ్మద్ సిరాజ్ కు స్థానం ఎలాగూ ఉంటుది. ఒక జయదేవ్ ఉండక్ కు కూడా స్థానం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక చివరి స్థానం కోసం నవదీప్ శైనీ, శార్దూల్ ఠాకూర్, ముఖేశ్ లలో ఒకరు చేరుతారు. ఇక గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బలంగా బరిలోకి దిగుతున్నది. దాదాపు ప్రస్తుత వెస్టిండీస్ టీమ్ ను చూసుకుంటే జట్టు బలంగా కనిపిస్తున్నది.