Roja Gift To Selvamani : సీనియర్ హీరోయిన్ రోజా (శ్రీలతా రెడ్డి) గురించి పరిచయం అవసరం లేదనుకుంటా. కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రోజా తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన జబర్దస్త్ తో చాలా కాలం జడ్జిగా కొనసాగారు. ఆ తర్వాత ఈటీవీలో చాలా షోలకు హోస్ట్ గా చేశారు రోజా. ఆమె భర్త ప్రముఖ దర్శకుడు సెల్వమణి అని అందరికీ తెలిసిందే. రోజా సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వీరి పరిచయం ఎక్కడ జరిగిందనే దానిపై తెలుసుకుందాం.
రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ‘ప్రేమ తపస్సు’ రోజా మొదటి సినిమా. ఇది 1991లో రిలీజ్ కాగా తర్వాతి చిత్రం ‘చామంతి’ ఇది 1992లో వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. రోజా భర్త సెల్వమణినే. ఈ సినిమాను తమిళంలో చెంబరుతి అని డబ్ చేసి తీశారు. అంటే తమిళ ఇండస్ట్రీకి రోజాను పరిచయం చేసింది. డైరెక్టర్ సెల్వమణినే.
ఆర్కే సెల్వమణి దర్శకుడు. తను ‘చామంతి’ సినిమా తీయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన కొత్త నటీమణి కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో ఆయన ఆఫీసుకు వచ్చింది రోజా. మొదటి సారి అక్కడే సెల్వమణిని చూసిందట. ఆ తర్వాత ఒక రోజు మేకప్ టెస్ట్, మరో రోజు కాస్టూమ్ టెస్ట్ ఇలా చేస్తూ ఈ సినిమాకు సరిపోతుందా అని చూశారు సెల్వమణి. ఆమె అన్నింటిలో ఆకట్టుకోవడంతో హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.
ఇక షూటింగ్ ప్రారంభం కావడంతో ప్రతీ రోజూ ఒకరికి ఒకరు కలిసి మాట్లాడుకునేవారు. క్రమంగా ఇది ప్రేమకు దారి తీసింది. ఈ సందర్భంలో ఒక సారి రోజా సెల్వమణికి వేంకటేశ్వర స్వామి ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చిందట. ఆ సమయంలో ఆయనకు రోజాపై మంచి అభిప్రాయం కలిగిందట. తనపై ప్రేమతోనే ఇచ్చిందని అనుకున్నారట. ఆ తర్వాత రోజా వాళ్లింటికి వెళ్లి పెళ్లి ప్రపోజల్ పెట్టారట సెల్వమణి. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ మొత్తం ఎపీసోడ్ లో ఒకరికి ఒకరు ఐలవ్ యూ అని చెప్పకపోవడం గమనార్హం.