Congress manifesto : పార్లమెంట్లో చర్చ లేకుండా ఇండియా సర్కార్ ఆమోదించిన ప్రజా వ్యతిరేక చట్టా ల న్నిటిని సమీక్షిస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో కార్మిక, రైతు ,క్రిమినల్ లా, పర్యావరణం, అడవులు, డిజిటల్ డేటా భద్రత వంటి చట్టాలు ఉన్నాయని వారు తెలిపారు.
సుప్రీంకోర్టులో రాజ్యాంగ న్యాయస్థానం అప్పిలు కోర్టులుగా విభజిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన కేసులను ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ న్యాయస్థానం విచారించి నిర్ణయం తీసుకుంటుం దన్నారు. అలాగే చట్టపరమైన ప్రాముఖ్యత లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర కేసులని అప్పిల్ కోర్టు పరిష్కరిస్తుందన్నారు.