Shreyas Iyer : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అందరు ఆటగాళ్లు బిజిబిజీగా ఉంటే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేశంలోనే పాపులర్ అయిన కపిల్ శర్మ కామెడీ షోకు వెళ్లారు. ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లను పలు ప్రశ్నలు అడిగాడు. దీనికి రోహిత్ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు చెప్పాడు. తను బ్యాటింగ్ చేసే సమయంలో బౌలర్లు చాాలా మంది సిక్సులు కొట్టొదని అంటారని అయినా తాను సిక్సులు కొట్టేవాడనని చెప్పాడు.
తమ గర్ల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు.. రోహిత్ బాయ్ సిక్సులు కొట్టవద్దని అనేవారని అయితే స్టేడియంలో నా భార్య రితిక కూడా ఉంది. ఆమె కూడా నేను బాగా ఆడాలనే కోరుకుంటుంది కదా నేనేం చేయను అంటూ ఫన్నీ సమాధానమిచ్చాడు. దీంతో షో లు నవ్వులు విరబూశాయి. ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో ఓటమిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. జీవితంలో తనకు ఉన్న లక్ష్యం
వన్డే వరల్డ్ కప్ గెలవడం అని అది చివరి దశలో నెరవేరకపోవడంతో తాను తట్టుకోలేకపోయానని బాధపడ్డాడు.
ఫైనల్లో ఓటమితో చాలా కుంగిపోయానని అది మాటల్లో వర్ణించలేనిదని చెప్పుకొచ్చాడు. దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని దీనికి తన భార్య రితిక, స్నేహితులు చాలా సాయం చేశారని చెప్పాడు. దీంతో షో లో ఉన్న వారందరూ లేచి నిలబడి చప్పట్లతో రోహిత్ ను అభినందించారు. తాను మ్యాచ్ సాగే సమయంలో తోటి ప్లేయర్లతో మాట్లాడే మాటలు వైరల్ అవుతున్నాయని దానికి కారణం తాను మైక్ ఉన్న ప్లేస్ లో నిలబడడమే కారణమన్నాడు.
అయితే రోహిత్ శర్మ గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఏ మాట మాట్లాడిన మాటకు ముందు ఒక తిట్టు మాట వెనకాల ఒక బూతు పదం వాడతాడు. అయితే అది కేవలం ఆటలో భాగమేనని అందులో సీరియస్ గా తీసుకోవాల్సింది ఏమీ లేదన్నాడు. క్రికెట్ లో ఇలాంటి సహజమే అని చెప్పుకొచ్చాడు.