Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు దక్కించుకుని సత్తా చాటుతున్నారు. యాక్టివ్ గా ఉంటూ హల్ చల్ చేస్తున్నారు. ప్రసార మాధ్యమాలను సద్వినియోగం చేసుకుని తమ పేరును సార్థకం చేసుకుంటున్న వారెందరో ఉన్నారు.
హరియాణాకు చెందిన ధ్రువ్ రాఠీ ఇండియాలో టాప్ సోషల్ మీడియా యాక్టివ్ గా పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో అతడికి 18.7 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతడు చెప్పే వాటికి ఫాలోవర్స్ తలూపుతూనే ఉంటారు. అతి విశ్లేషణలను అనుకరిస్తుంటారు. అలా యూట్యూబ్ స్టార్ గా మారిపోయి తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు.
సామాజిక, రాజకీయ, సమగ్ర విశ్లేషణలతో ఆకట్టుకుంటాడు. తనదైన పంథాలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అతడికి ఫాలోవర్స్ ఎక్కువే. టాప్ పొలికల్ ఇన్ ఫ్లూయెన్సర్ గా ఎదిగాడు. దీంతో అతడి పేరు మారుమోగుతోంది. ఈనేపథ్యంలో యూట్యూబ్ లో రాజకీయ విశ్లేషణల నేపథ్యలో అతడి పేరు దేశమంతా విస్తరిస్తోంది. పొలిటికల్ విషయాల మీద అనర్గళంగా మాట్లాడే అతడి తీరు అందరికి నచ్చతుంది.
తదుపరి తరపు నాయకులు పేరిట 2023 జాబితాలో టైమ్ మ్యాగజైన్ అతడికి చోటు కల్పించింది. దీంతో ధ్రువ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇటీవల అతడు కేంద్రాన్ని నిలదీస్తూ చేసిన వీడియోలు ట్రెండ్ కావడంతో అతడికి మరింత పాపులారిటీ దక్కుతోంది. ఇలా ధ్రువ్ తన మాటలతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. అయితే ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తూ ట్రెండ్ అవుతున్నారు. కేంద్రం అవలంబిస్తున్న తీరుపై ప్రశ్నిస్తున్నారు. సమాజంలో బీజేపీ చీలికలు తెస్తోందని మండిపడుతున్నారు. దీంతో ధ్రువ్ రాఠీ ట్రెండ్ అవుతున్నారు. బీజేపీ శ్రేణులు నెగిటివ్ కామెంట్స్ పెడుతుండగా.. ప్రతిపక్షాల నేతలు, క్యాడర్ ధ్రువ్ కు పాజిటివ్ గా కామెంట్స్ పెడుతుండడం గమనార్హం. దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.