ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పది గంటల సమయంలో మైత్రి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కూర్చుని ఉన్న రవిపై ఆకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ముందు పిడిగుద్దులు, తర్వాత రాళ్లతో దాడి చేశారు. రవిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇష్టానుసారంగా కొట్టారు. ఈ క్రమంలో రవి ని కాపాడే ప్రయత్నం చేశారు అక్కడున్న స్థానికులు గాయపడిన రవిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు తనపై దాడి చేయించారని మున్నూరు రవి బంధువులు ఆరోపిస్తున్నారు. తనని చంపించడానికి విరసనోళ్ల శ్రీకాంత్ గౌడ్ మనుషులను పంపించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజకీయంగా ఎదుగుతున్న తన బిడ్డపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు హత్య యత్నానికి పాల్పడ్డాడని తన కొడుకుకు ఏం జరిగినా మంత్రి శ్రీనివాస్ గౌడే కారణమని రవి తల్లి ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గోన్న మున్నూరు రవి, గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో మున్నూరు రవి నిందితుడుగా ఉన్నారు. పాత కక్షల వల్లనే మున్నూరు రవి దాడి జరిగిందని పాలమూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.