TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ప్రచార రథంపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేశాయి. ఈ ఘటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ప్రమాదం తప్పింది.
ప్రచార రథానికి రాళ్లు తగిలాయి. ఒకరాయి ప్రచార రథానికి తగిలి ఆ ప్రక్కనే ఉన్న వీరేశ్ అనే విద్యార్థి నుదిటికి తగలడంతో గాయమైంది. వేటనే విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. రాళ్లదాడి ఘటనతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. వైసీపీ మూకలను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. రాళ్లదాడిలో గాయపడిన విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు కుందుర్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.