ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో నిండా మునిగారు. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని టీడీపీ బయట పెట్టింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించి.. చివరికి ఆయన పెట్టింది… నకిలీ డిగ్రీ అని ఆధారాలు బయట పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు.
తమ్మినేని విషయంలో టీడీపీ నాయకులు ఆయన తప్పుడు డిగ్రీని సంపాదించే విషయంలో సక్సెస్ అయ్యారని చంద్రబాబు అభినందించినట్లు సమాచారం.. అయితే తెలంగాణ ప్రభుత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి… నకిలీ డిగ్రీ పోలీసులు కేసు నమోదు చెయ్యలేదు… నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే ఆయన యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి.
టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయట పెట్టింది. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే దానికి అంత విలువ రాదు. తమ సర్టిఫికెట్లు ఫేక్ చేసినందుకు యూనివర్శిటీ లేదా కాలేజీ పోలీసు కేసు పెట్లాల్సి ఉంటుంది.. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు.. ఎందుకుతయారు చేశారు అనే విషయం పోలీసుల విచారణ లో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అయితే ఇప్పటికిప్పుడు తమ్మినేని కి వచ్చిన సమస్య ఏమి ఉండదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.. వచ్చే ఎన్నికల తర్వాత ఆయనకు స్పీకర్ పదవి ఉండదు. ప్రభుత్వాలు ఇవే ఉంటాయన్న గ్యారంటీలేదు. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అధికారంలో కి వస్తే ఆయన తీరును మొదటి నుంచి అసహనం వ్యక్తo చేస్తున్న టీడీపీ ఉరుకుంటుందా. అంతకఅంతకు ప్రతీ కారం తీర్చుకుంది.. అనీ టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి..