ఏపి.. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగుల ను అర్ధరాత్రి అమనుషంగా అరెస్టు చేయడాన్ని సిపి ఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో డిసిపి విశాల్ గున్ని నాయకత్వంలో వందలాది మంది పోలీసులు టెంట్ ను పీకెసి, కరెంట్ తీసేసి దీక్షలో ఉన్న వారి పట్ల కనికరం కూడా చూపకుండా, మహిళలని కూడా చూడకుండా అమా నుషంగా వ్యవహరించారని సిపియం నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్ట్ సమయంలో మగ పోలీసులే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్దం అని వారు ఆవేధన వక్తం చేశారు.అరెస్ట్ ను కవర్ చేస్తున్న మీడి యా పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరిం చడం దారుణం అని వారు అన్నారు. సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్కరించకుండా అంగన్వాడి మహిళా ఉద్యమాన్ని అమానుషంగా అణచివేయడం సరైన పద్దతి కాదని సిపియం నాయకులు మండిపడ్డారు. తక్షణం వారిని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అమను షానికి వ్యతి రేకంగా ఎక్కడిక క్కడే నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.