Nandamuri Suhasini – Chandrababu’s arrest : మచ్చలేని చంద్రుడికి మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలు చేపట్టారని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహసిని అన్నారు. తాజాగా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగు జాతికి ఇవ్వాల ఒక చీకటి రోజు అని ఆమె అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేయడాన్ని సుహాసిని ఖండించారు. ఈ చర్యను సుహాసిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేశారు.
చంద్రబాబు 45 ఏళ్లలో 14 ఏళ్లు సీఎంగా అభివృద్ధి చేసిన నాయకుడు. ఆయనను ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రజలంతా చూస్తున్నారని.. అధికార వైసీపీకి గట్టి సమాధానం ఇస్తారన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని.. గెలుపు మనదే అవుతుందని.. న్యాయం గెలుస్తుందని సుహాసిని అన్నారు.
మచ్చలేని చంద్రుడికి మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలు.
– టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహసిని మీడియా సమావేశం.#WeStandWithCBNSir #ChandrababuArrest #TDPTelangana pic.twitter.com/6HhzfezpYj
— TDP TELANGANA (@TDP_TS) September 10, 2023