Telangana EC’s key statement : తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మరో పన్నెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది. ఎక్కడికక్కడా అధికారులు రంగంలోకి దిగారు. కొందరు అధికారులను కూడా ఈసీ మార్చివేసింది. అయితే కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.
ఎన్నిలక సందర్భంగా మద్యం ఏరులై పారే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డబ్బులతో ప్రలోభాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆయా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరి అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లల్లో నగదు పట్టుకున్నారు. అయితే రూ. 50వేలకు మించి తీసుకెళ్తేనే ఇబ్బంది. అయితే దీనిపై విమర్శలు వినిపించాయి. సామాన్యులు ఇబ్బంది పడేలా ఈసీ నిబంధనలు ఉన్నాయని టాక్ వచ్చింది. అత్యవసర పనుల మీద డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారని కొందరు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొందరు అత్యవసర పనుల హడావుడిగా తీసుకెళ్తున్నా పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తున్నారు. దీనిపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
అయితే దీనిపై ఈసీ తాజాగా స్పందించింది అధికారులు పట్టుకున్న నగదుకు సంబంధించి ఆధారాలు చూపితే 48 గంటల్లో తీసుకెళ్లొచ్చని చెబుతున్నది. అయితే వీటి విలువ కేవలం రూ. 10 లక్షలలోపు వాటికి మాత్రమే అంటూ చెప్పింది. పది లక్షలు దాటితే మాత్రం ఐటీ అధికారులకు వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఈ ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లాలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.