Telugu People Foundation : ఎంత సంపాదించినా.. ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నా.. ‘సేవ’ చేసే యోగం మాత్రం కొందరికి ఉండదు. సేవ చేయాలంటే ఇష్టంగా కష్టపడాలి. ‘ఉన్నవాడు కొంచం ఇస్తే.. లేని వాడె ఉండడే..’ అన్న ఒక సినిమా లిరిక్. ఎంత డబ్బు ఉన్నా.. సేవ చేసేంత సమయం కూడా కుదరకపోవచ్చు. సేవ చేయాలనే ఇంట్రస్ట్ ఉన్న కొందరు కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా అమెరికాలో ఏర్పాటు చేసిన తెలుగు పీపుల్ ఫౌండేషన్ (Telugu People Foundation-TPF) లక్షలాది మంది పేద విద్యార్థులకు చదువు చెప్పి ఉద్యోగాలు కల్పించడంలో తోడ్పడుతుంది. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా స్కూల్స్ (పాఠశాలలను)ను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. దీనితో పాటు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందజేస్తారు.
చదువులో ప్రతిభ చూపితే ప్రోత్సాహకాలు ఇస్తారు. చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కల్పించడంలో కూడా సాయం చేస్తారు. విద్యార్థులు ఉపాధిని పొంది, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగాక వారు కనీసం TPF నుంచి పొందిన స్కాలర్షిప్, సహాయం లేదా అవార్డు మేరకు ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు మద్దతిచ్చేలా ప్రోత్సహిస్తారు. ఈ ఫౌండేషన్ కు ఆపిల్, డాక్టర్ రెడ్డీస్ తో పాటు చాలా పెద్ద సంస్థలు విరాళాలు అందజేస్తాయి.
తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఏర్పాటై 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 2023, డిసెంబర్ 10వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటలకు న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. డోనార్స్, సాయం పొందిన వారు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు చెప్తున్నారు.